క్రైమ్/లీగల్

ఆగి ఉన్న ట్రాలీని ఢీకొట్టిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, ఆగస్టు 6: జాతీయ రహదారిపై ఆగిఉన్న ట్రాలీని కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి జంక్షన్ వద్ద సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో వారి రెండేళ్ల కుమారుడు, స్నేహితులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
వీరికి ప్రథమ చికిత్స అందజేసి అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఉన్నా సాగర్ (28), పుల్లా రజని (29), వారి రెండేళ్ల కొడుకు దేవ్, హైదరాబాద్‌కు చెందిన వారి స్నేహితుడు మారెంపూడి నారాయణరాజు తూర్పుగోదావరి జిల్లా తునిలోని తలుపులమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి విశాఖ నుండి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు మరో కారును తప్పించే క్రమంలో రోడర్డపై ఆగి ఉన్న ట్రాలర్‌ను ఢీకొట్టింది.
ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. భార్యాభర్తలు సాగర్, రజనీ అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితోఉన్న దేవ్‌ను ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. నారాయణరాజు, సైక్లిస్టు దుంగల అప్పారావును విశాఖ తరలించారు. నారాయణరాజు పరిస్థితి ఆందోళనకరంగా ఉందిధి. స్థానిక ఎస్‌ఐ పి.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.