క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, కశింకోట, ఆగస్టు 6: ఉదయానే్న టౌన్‌కెళ్లి పనులు ముగించుకుని వద్దామనుకున్న ఆ ఇద్దర్నీ ఆర్టీసీ బస్సు మృత్యువై కబళించింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కశింకోట నుంచి సోమవారం ఉదయానే్న కశింకోటకు చెందిన దొడ్డి ఈశ్వరరావు (54), కశింకోట మండలం సింగవరం గ్రామానికి చెందిన జామి లక్ష్మి (40), అనకాపల్లి వేల్పులవీధికి చెందిన సెక్యూరిటీ గార్డు గొర్లి లక్ష్మీనారాయణ, కశింకోటకు చెందిన శిరిష ఆటోలో అనకాపల్లికి బయలుదేరారు. కొద్దిసేపటికే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ లగ్జరీ బస్సు ఈ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈశ్వరరావు, లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోడ్రైవర్ మాదేటి సత్యనారాయణ (35), సెక్యూరిటీ గార్డు లక్ష్మీనారాయణకు తీవ్రంగా గాయాలు కాగా, వెనుక కూర్చున్న కశింకోట కనకమహలక్ష్మీ వీధికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు పెంటకోట అప్పారావుకిందకు దూకేయడంతో గాయపడ్డాడు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.