క్రైమ్/లీగల్

చిచ్చురేపిన కుటుంబ కలహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతేపల్లి, ఆగస్టు 7: కుటుంబ కలహాలతో భార్య, కాళ్లు చేతులు నరికి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జటంగి శ్రీను (33)కు సూర్యాపేట మండలం కేసారం గ్రామానికి చెందిన రజితతో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను గ్రామంలో తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత ఆరు ఏళ్ల నుండి దంపతుల మధ్య కుటుంబ కలహాలు రావడంతో తరుచూ గొడవలు పడుతుండేవారు. దీంతో సరిత ఆరు సంత్సరాల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. సరిత తల్లిదండ్రులు నెలరోజుల క్రితం పెద్దల సమక్షంలో మాట్లాడి సరితను భర్త వద్దకు కాపురానికి పంపారు. కొన్ని రోజుల పాటు భార్యభర్తలు అన్యోన్యంగా ఉండగా ఆ తర్వాత మళ్లీ కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సరితతో ఘర్షణపడ్డ శ్రీను క్షణికావేశంలో సరిత కాళ్లు, చేతులను కిరాతకంగా గొడ్డలితో నరకడంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆపస్మారకస్థితికి చేరుకుంది. భార్యను నరికిన అనంతరం శ్రీను సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లి విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీను విచక్షణారహితంగా దాడి చేయడం భార్యపై ఉన్న అనుమానమేనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న సరితను పోలీస్ సిబ్బంది 108 వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని శాలిగౌరారం సీఐ క్యాస్ట్రోరెడ్డి పరిశీలించి ఘటనకు గల కారణాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.