క్రైమ్/లీగల్

డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 9: చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసుకు సంబంధించి సీఐడీ సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తూ పీజీ చేస్తున్న శిల్ప కళాశాల అక్కడి ప్రోఫెసర్ల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆమె తొలుత గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం వల్లే వేధింపులు శృతి మించి ఆమె ఆత్మహత్యకు దారితీసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు శిల్ప మృతిపై కేసు నమోదు చేశారు. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వాస్తవాలు నిగ్గు తేల్చాలని కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ఆర్‌టి ఠాకూర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.