క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, ఆగస్టు 9: గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మండలంలోని అందుగుల కొత్తపాలెంకు చెందిన గురజాల సోమయ్య (30), చల్లా వెంకటకృష్ణ (23), బోడబోయిన మల్లికార్జునరావు (28) మోటార్ సైకిల్‌పై వినుకొండకు వస్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ ఏపీ 05టీడీ 3174 ఢీకొనడంతో మోటారుసైకిల్ నడుపుతున్న సోమయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. క్షతగాత్రులు చల్లా వెంకటకృష్ణ, మల్లిఖార్జునరావులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి, వైద్య సేవలు అందిస్తుండగా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, టౌన్ సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇలాఉంటే వైకాపా నాయకులు పథకం ప్రకారమే రోడ్డు ప్రమాద రూపంలో ఈ హత్యలకు పాల్పడ్డారని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. మృతులు ముగ్గురూ టీడీపీ కార్యకర్తలేనన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని పోలీసు అధికారులు చెప్పారు.

చిత్రం..ప్రమాద స్థలంలో సోమయ్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డీఎస్పీ నాగేశ్వరరావు