క్రైమ్/లీగల్

బందరులో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 14: కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న చిన్నచిన్న సమస్యలకు మనస్థాపానికి గురైన భార్యాభర్తలు యేడాదిన్నర వయస్సు కలిగిన తమ కుమారుడితో ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఇది. స్థానిక రాజుపేటలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పద్మనాభుని నాగేశ్వరరావు కుమారుడు సుధీర్, అతని కోడలు జ్యోతి, యేడాదిన్నర వయస్సు కలిగిన మనువడు ధృవ మంగళవారం తెల్లవారు జామున వారు నివాసం ఉంటున్న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బందరు డీఎస్పీ మహ్మద్ బాషా, తహశీల్దార్ కె శ్రీనివాస్, చిలకలపూడి, రూరల్ సీఐలు దుర్గాప్రసాద్, రవికుమార్ ఘటనా స్థలికి వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సుధీర్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండగా జ్యోతి, అతని కుమారుడు ధృవ విషం తీసుకుని మృతి చెందారు. దీని బట్టి సుధీరే భార్య, కుమారుడికి విషం ఇచ్చి ఆ తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణం కుటుంబంలో నెలకొన్న చిన్నచిన్న సమస్యలుగా పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించినట్టు తెలుస్తోంది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహ్మద్ బాషా తెలిపారు.