క్రైమ్/లీగల్

తమ్ముడి కళ్లముందే అక్క దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డగూడూరు, ఆగస్టు 26: ద్విచక్రవాహనంపై తన సోదరునికి రాఖీ కట్టేందుకు వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకా రం.. తమ్ముడికి రాఖీ కట్టేందుకు అడ్డగూడూ రు మండలం గురజాల గ్రామానికి చెందిన ఆలకుంట్ల ఇద్దమ్మ (38) కొండంపేటకు వెళ్లే క్రమంలో పాటిమట్ల గ్రామంలో బస్సు దిగిం ది. అక్కడి నుండి ఇద్దమ్మను తమ్ముడు ధనకొండ తన బైకుపై కొండంపేటకు తీసుకెళ్తుండగా డి-రేపాక గ్రామ సమీపంలో బైకు అదుపు తప్పడంతో ఇద్దమ్మ కిందపడింది. ఆమె తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లముందే తనకు రాఖీ కట్టేందుకు తనతో పాటే వస్తూ ప్రమాదంలో అక్క మృతి చెందడంతో తమ్ముడు దుఃఖంలో మునిగిపోయాడు. ఇది చూసిన వారంతా చలించిపోయారు. విషయం తెలుసుకున్న ఏఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దమ్మను 108 అంబులెన్సులో ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చిత్రం..మృతిచెందిన ఇద్దమ్మ