క్రైమ్/లీగల్

సిద్దిపేటలో...రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 26 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామ శివారులో పెద్దమ్మ గుడి సమీపంలో జరిగింది. సిద్దిపేట రూరల్ ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామానికి చెందిన బద్దిపడగ రాజు (24) హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ నుండి తన స్నేహితుడు నరేష్‌తో కలసి బైక్‌పై గ్రామానికి బయాలు దేరారు. ఈక్రమంలో సిద్దిపేట శివారు పుల్లూ రు పెద్దమ్మ ఆలయం సమీపంలో బస్సు ప్రక్కనుండి వెళ్తున్న క్రమంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఢీకొట్టడంతో రాజు ఎగిరి బస్సు వెనుక టైర్ కింద ప డటంతో అక్కడికక్కడే మృతిచెందారు.
స్నేహితుడు నరేష్‌కు తీవ్ర గాయాలైనాయి. మృతుడు తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపారు.

చిత్రం..రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రాజు