క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి, ఆగస్టు 27: కూసుమంచి మండల కేంద్రంలో స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు ఆదివారం రాత్రి 11గంటల సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న పల్సర్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న డిసిఎం వాహనం ఢీకొట్టడంతో బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు వడ్డె కార్తీక్(26)కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు. మృతుడు కార్తీక్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రాఖీ పండుగకు వచ్చి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపి తిరిగి హైదరాబాద్ ఉద్యోగానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సభ్యులు బోరున విలపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశిలీంచిన ఎస్‌ఐ పూదరి రఘు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాడు.