క్రైమ్/లీగల్

అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంగనూరు, ఆగస్టు 27: అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందిన సంఘటన సోమవారం పుంగనూరు మండలంలో జరిగింది. ఎస్సై గౌరిశంకర్ కథనం మేరకు వివరాలు... మండలంలోని మంగళం పంచాయతీ చెలిమిగడ్డకు చెందిన లక్ష్మినారాయణ కుమారుడు దేవేంద్ర(19) స్థానిక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే మండలంలోని కంగానెల్లూరు గ్రామ సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద చింత చెట్టుకు డ్రిప్ పైపులతో ఉరివేసుకుని మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికలపై ఆధార పడిందన్నారు. ఇది ఇలావుండగా దేవేంద్ర కుటుంబ సభ్యులు కథనం మేరకు వివరాలు... మండలంలోని కంగానెల్లూరు గ్రామానికి చెందిన ఝూన్సి(17) అనే విద్యార్థిని, దేవేంద్రల మధ్య ప్రేమ వ్యవహారం జరుగుతుండేదని, ఇది తమకు తెలవడంతో తమ బిడ్డను మందలించామని, అప్పటి నుంచి ఎలాంటి సంఘటనలు జరగలేదన్నారు. అయితే ఈనెల 22వ తేదీన ఝూన్సి తన నివాసంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తమ బిడ్డను యువతి కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. పోలీసులు మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతోమృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఏది ఏమైనా పోస్టుమార్టం నివేదికలపై కేసు ఆధారపడింది.