క్రైమ్/లీగల్

మనస్తాపానికి గురై తల్లి కూతురు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగొండపాలెం, ఆగస్టు 28: నిత్యం మద్యం సేవించి తల్లిని తిడుతూ కొడుతుంటే చూడలేక కూతురు, చెడువ్యసనాలకు బానిసైన భర్త వేళాపాళా లేకుండా వేధింపులకు గురిచేస్తూ నరకయాతన చూపిస్తుంటే తాళలేక మనస్తాపానికి గురై భార్య చీరకొంగుతో ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన మంగళవారం తెల్లవారుఝామున పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్‌వెండర్‌గా పని చేస్తున్న లింగమల్లు రామచంద్రశేఖర్ ఉట్లస్తంభాల బజారులో నివాసం ఉంటున్నాడు. నిత్యం మద్యం సేవించి భార్యను వేధించడం, పుట్టింటికి పంపడం జరుగుతున్న నేపథ్యంలో 2016వ సంవత్సరంలో కూడా స్థానిక పోలీసుస్టేషన్‌లో అతని భార్య అమరేశ్వరి ఫిర్యాదు చేసింది. అయితే నిత్యం వేధింపుల కారణంగా మనస్తాపానికి గురైన భార్య అమరేశ్వరి (36), కూతురు దివ్యస్మిత (16) మంగళవారం తెల్లవారుఝామున ఇంటిలోని ఫ్యాన్‌కు చీరకొంగుతో ఉరి వేసుకొని మరణించారు. భర్త రామచంద్రశేఖర్ తెల్లవారుఝామున మద్యం మత్తు నుంచి లేచి చూసేసరికి భార్య, కూతురు శవాలుగా పడి ఉండటంతో పరారయ్యాడు. పోలీసులు చాకచక్యంగా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామం వద్ద అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సిఐ మల్లిఖార్జునరావు, ఎస్సై దేవకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.