క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలూరు, ఆగస్టు 28: మండలంలోని తుంబళవీడు గ్రామంలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన భర్త నెరణికి రామయ్య(65) భార్య బోయ వన్నూరమ్మ(60)లు సోమవారం రాత్రి 11.30 సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న మనవరాలును ఇంటి లోపల నిద్రపుచ్చి ఇరువురు దంపతులు బయటికి వచ్చాక మొదట రామయ్య భార్యకు పురుగుల మందు ఇచ్చి తాగించి ఆతరువాత అతను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అయితే వృద్ధ దంపతుల ఆత్మహత్యలపై గ్రామంలో బిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు, ఐదుగురు ఆడ పిల్లలు ఉన్నారని, వీరందరికి వివాహం అయిందని, కుమారుల్లో ఒకరు బన్నూరు గ్రామంలో, మరొకరు హత్తిబెళగల్ గ్రామంలో నివాసం ఉన్నట్లు తెలిసింది. అయితే తండ్రి కూతురుకు రెండు ఎకరాల పొలం రాసి ఇచ్చినట్లు దీంతో ఇరువురు కుమారులు నాలుగు రోజుల క్రితం తండ్రిని తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. దీంతోనే మనస్థాపానికి గురై రాత్రి ఆత్మహత్య చేసుకున్నారని, దీనిపై విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉందని ఆలూరు పోలీసులు తెలపారు. కాగా మృతి చెందిన రామయ్యకు ఆలూరులోని ఒక బ్యాంకులో రుణం తీసుకున్నారని ప్రభుత్వం ప్రకటించిన రుమాఫీ తనకు వర్థించలేదని కేవలం కొద్ది మొత్తం మాత్రమే మొదటి విడుతలో జమ అయినట్లు రుణమాఫీ పత్రాన్ని బ్యాంకుకు తీసుకుని రుణం వెళ్లగా రుణమాఫీ కాలేదని బ్యాంకు సిబ్బంది చెప్పినట్లు సమాచారం. దీంతోనే వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కథనాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి వృద్ధ దంపతుల ఆత్మహత్యకు గల కారాణాలు విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. అర్ధారాత్రి జరిగిన సంఘటనతో ఆలూరు సీఐ దస్తగిరిబాబు మంగళవారం ఉదయం గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.