క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఆగస్టు 30 : కట్టుకున్న భర్త తనను మోసం చేస్తున్నాడని ఆవేదనకు గురై భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం మడకశిరలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని హరిజనవాడకు చెందిన కన్యాకుమారి (22) అనే మహిళను అదే కాలనీకి చెందిన ధనుంజయను గత మూడు నెలల క్రితం ప్రేమించుకొని పెద్దలకు తెలియకుండా కర్నాటక ప్రాంతంలో వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అయిన తర్వాత వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. గత వారం రోజుల క్రితం కన్యాకుమారి స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పి న్యాయం చేయాలని కోరింది. దీంతో పోలీసులు ధనుంజయను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పారు. అయితే ధనుంజయ అక్క కుమార్తెతో వివాహం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తనకు న్యాయం జరగదని భావించి జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్య చికిత్సలు చేయడంతో ప్రాణాపాయం నుండి రక్షించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శుభకుమార్, ఎస్సై లింగన్న ఆసుపత్రికి చేరుకొని కన్యాకుమారికి నచ్చచెప్పారు. ఇప్పటికే ధనుంజయను అదుపులోకి తీసుకున్నామని, తప్పకుండా న్యాయం చేస్తామని, అతనిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.