క్రైమ్/లీగల్

యువకుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, ఆగస్టు 30: వివాహేతర సంబంధం ఒక యువకుడి ప్రాణం తీసిన సంఘటన గురువారం నారాయణవనం మండలంలో చోటు చేసుకునింది. పట్టపగలే ఒక యువకుడు హత్యకు గురికావడంతో మండల ప్రజలు ఉలిక్కి పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. నైనారు కండ్రిగ పంచాతీయ మిట్టనైనారు కండ్రిగకు చెందిన పి.అర్ముగాచారి కుమారుడు పి.షణ్ముగం (23) గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హత్యకు గురైయ్యాడు.మృతుడు షణ్ముగం అదే గ్రామానికి చెందిన తాపీ మేస్ర్తి మునివేలు భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో అనుమానించిన మునివేలు తన భార్య, ఇద్దరు పిల్లలతో పుత్తూరుకి తన నివాసాన్ని మార్చాడు. అయినప్పటికి షణ్ముగం తరచూ పుత్తూరుకి వెళ్లి మునివేలు భార్యను కలిసేవాడు. దీంతో మునివేలు, షణ్ముగం మధ్య ఘర్షణలు జరిగాయి. తీరుమార్చుకోకుంటే చంపేస్తానంటూ మునివేలు తన భార్యను హెచ్చరించాడు. ఇదే విషయాన్ని ఆమె షణ్ముగానికి చెప్పి తన ఫోన్ నెంబర్‌ను మార్చేస్తానని చెప్పింది. కాని షణ్ముగంలో మార్పు రాలేదు. ఈవిషయం తెలుసుకున్న మునివేలు గత రెండు రోజులుగా షణ్ముగంతో స్నేహం నటిస్తూ వచ్చాడు. గురువారం సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఎరకంబట్టు చెరువు వద్దకు రమ్మని మునివేలు, షణ్ముగంను పిలిపించాడు. షణ్ముగం తనను మునివేలు రమ్మంటున్నాడని తన స్నేహితుడు ప్రకాష్‌కు ఫోన్ చేసి చెప్పాడు. షణ్ముగం ఒంటరిగా అక్కడకు వెళ్లాడు. అప్పటికే పథకం ప్రకారం కాపుకాసిన మునివేలు, షణ్ముగంపై కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. తల వెనుక బలమైన గాయం కావడంతో షణ్ముగం మృతి చెందాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్థానిక పశువుల కాపర్లు షణ్ముగం మృతి చెంది ఉండటాన్ని గమనించి స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షణ్ముగం సెల్‌ఫోన్ ఆధారంగా అతని తండ్రి ఆర్ముగం ఆచారికి సమాచారం అందించారు. తన కుమారుడుని చంపింది మునివేలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మునివేలు కోసం గాలిస్తున్నారు.