క్రైమ్/లీగల్

లారీ, బైక్ ఢీకొని ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, ఆగస్టు 30: మండల కేంద్రంలో గురువారం ఉదయం లా రీ, బైక్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలై చావుబతుకుల మధ్య వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నా రు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ నుం చి హుజురాబాద్ వైపు వెలుతున్న లారీ హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కేశపట్నం గ్రా మానికి చెందిన వారు ద్విచక్రవాహనంపై వెళుతున్న గూళ సంపత్ (39), సమ్మయ్య, తిరుపతికి తీవ్ర గాయాలు కాగా హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ సంపత్ మృతి చెందగా, సమ్మయ్య, తిరుపతిని వరంగలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీ రి పరిస్థితి కూడా విషమంగా వుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సంపత్ భార్య రజిత ఫిర్యాదు మేరకు కేశవట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్లగౌడ్ తెలిపారు. కాగా మండలంలోని అన్ని పార్టీ నేతలు హుజురాబాద్ ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు సంఘటన వివరాలను వివరించారు. ఒకే గ్రామానికి చెందిన ము గ్గురు ప్రమాదానికి గురి కావడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.