క్రైమ్/లీగల్

దోపిడీ దొంగల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 30: రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో దారిదోపిడీదారులు బీభత్సం సృష్టించారు. వ్యక్తిపై అతి దారుణంగా దాడికి తెగబడి అతని వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదును ఎత్తుకెళ్లారు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీలో పని చేసే క్యాషియర్ రాము పాతనగరంలోని సంతోష్‌నగర్‌లో నివసిస్తున్నాడు. కాగా రాము బుధవారం రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో కాపుగాసిన దుండగులు అతన్ని అడ్డగించి రామును కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. దీంతో రాము స్పృహ కోల్పోయాడు. రాము వద్ద ఉన్న బ్యాగ్‌లో ఉన్న రూ.6.7 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఆపాస్మారక స్థితిలో పడి ఉన్న రామును స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రామును ఆసుపత్రికి తరలించారు. రాము ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని డాక్టర్లు తెలిపారని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.