క్రైమ్/లీగల్

గుంటూరు సమీపంలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, ఆగస్టు 31 : గుంటూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని గొంగటిపల్లి గ్రామానికి చెందిన నరసింహప్ప (35) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహప్ప తన లారీలో గుంటూరుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గురువారం తెల్లవారుఝామున రోడ్డు పక్కన తన లారీని ఆపి రోడ్డు అవతలి వైపునకు టీ తాగేందుకు వెళ్తున్న సమయంలో మరో వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో నరసింహప్ప మృతి చెందినట్లు తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కైన నరసింహప్ప మృతి చెందడంతో కుటుంబం దిక్కులేనిదైంది. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
పెరల్స్ ఏజెంట్ ఆత్మహత్య
గుత్తి, ఆగస్టు 31 : మండల కేంద్రంలోని బండగేరిలో నివాసం ఉండే పెరల్స్ ఏజెంట్ వెంకటేష్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెరల్స్ సంస్థలో ఏజెంట్‌గా పని చేసిన వెంకటేష్ స్థానికుల నుంచి సుమారు రూ.15 లక్షల మేర సంస్థలకు డిపాజిట్లు చేయించారు. గడువు ముగిసినా సంస్థ బాండ్లకు చెందిన నగదు ఖాతాదారులకు చెల్లించకపోవడంతో ఖాతాదారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన వెంకటేష్ ఇంట్లో ఎవరూలేని సమయంలో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.