క్రైమ్/లీగల్

రైలు పట్టాలు దాటుతూ మహిళ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, ఫిబ్రవరి 26: నిడుబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం రైలుపట్టాలు దాటుతున్న ఓ మహిళను రైలు ఢీకొనడటంతో దుర్మరణం చెందింది. స్థానికుల కథనం ప్రకారం... గుర్తు తెలియని ఓ మహిళ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో రైలు పట్టాలు దాటుతుండగా స్టేషన్ నుంచి చెన్నై వైపు వెళ్తున్న రైలు ఆమెను ఢీకొంది. దీంతో ఆమె కాళ్లూ, మొండెం వేరై దుర్మరణం చెందింది. మృతురాలు తెల్లరంగు పంజాబీ డ్రస్ ధరించి ఉంది. దాదాపు 25 సంవత్సరాల వయస్సు కలిగి, మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెల ఆధారంగా వివాహితురాలిగా తెలుస్తోంది. బాపట్ల రైల్వే మహిళా ఎస్‌ఐ మహాలక్ష్మి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.