క్రైమ్/లీగల్

హత్యకేసులో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఫిబ్రవరి 26:ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన కేసులో భార్య, ప్రియుడు, అతడికి సహకరించిన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అందుకు సంబంధించి సోమవారం డీఎస్పీ మాధవరెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాములపాడు మండల పరిధిలోని బానుకచెర్ల గ్రామానికి చెందిన మల్లికార్జునరావును ఈ నెల 17వ తేదీ ఆత్మకూరు పట్టణ శివారులోని ఓ వైన్స్ షాపు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. దీంతో అతడి భార్య మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారన్నారు. విచారణలో భాగంగా ఆత్మకూరు పట్టణానికి చెందిన గోపాల్‌కు మహాలక్ష్మీతో గత మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉందని తేలిందన్నారు. గోపాల్ తన బంధువు జంబులయ్య సహకారంతో మల్లికార్జునకు మద్యం తాపించి బీరు సీసాతో పొడిచి హత్య చేశారన్నారు. గోపాల్, జంబులయ్య ఆత్మకూరు పట్టణంలోని ఏరాసు ప్రతాపరెడ్డి కాలనీలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అలాగే మృతుడి భార్య మహాలక్ష్మీని ఆమె ఇంటిలో అదుపులోకి తీసుకుని ముగ్గురినీ కోర్డులో హాజరు పరిచారు.