క్రైమ్/లీగల్

రోడ్టు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 26: వారు ముగ్గురు స్నేహితులు. కల్సిమెల్సి ఉంటూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. బయట పనిపై వెళ్లిన వారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాధ సంఘటన ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లా అవాడ గ్రామానికి చెందిన లక్ష్మణ్ (25), నితీష్ (27), హోరిల్ అలియాస్ రోహిత్ (18) బతుకుదెరువు కోసం ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఉప్పల్ ఐడిఏ లక్ష్మీనారాయణ కాలనీలో నివసిస్తూ, స్థానిక భజరంగ్ ప్యాకేజీ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి 12గంటల సమయంలో అంబర్‌పేటకు పనిపై వెళ్లి తిరిగి ఇంటికి హోండా ప్లజర్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు మాడ్రన్ బేకరీ పరిశ్రమ వద్ద వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రాణ స్నేహితులైన వారు కలిసి మరణించడంతో లక్ష్మీనారాయణ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బీహార్‌లోని స్వగ్రామానికి పంపించినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.