క్రైమ్/లీగల్

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యర్రగొండపాళెం, సెప్టెంబర్ 16: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన యర్రగొండపాళెం పట్టణంలోని మిల్లంపల్లి పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చింతపల్లి బజారుకు చెందిన పద్మిశెట్టి వెంకటేశ్వర్లు (55) పొలం సాగు కోసం అప్పులు చేశాడు. రెండు దఫాలుగా బోరు వేసినా నీరు రాకపోవడంతో, చేసిన అప్పులు తీరే దారిలేక ఆదివారం సాయంత్రం తన పొలంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం సాగు కోసం బ్యాంకులో రుణాలు తీసుకోవడమే కాకుండా తెలిసిన వారి వద్ద నుండి సుమారు ఐదు లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. ఇంటి స్థలం అమ్మినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.