క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధరనెల్లూరు, ఫిబ్రవరి 27: మండల పరిధిలోని బాలగంగనపల్లి పంచాయతీకి చెందిన బట్టు జంగనపల్లిలో కొడుకు, కోడలి మృతిని జీర్ణించుకోలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఇరగమరెడ్డి(90), ఆదెమ్మ(80) కుమారుడు జయరామిరెడ్డి(50), సరోజమ్మ(45) ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ తమలో తామే ఆ వృద్ధ దంపతులు తీవ్ర మధనపడేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇరగమరెడ్డి, ఆదెమ్మలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్ది సేపటి తువాత అపస్మారక స్థితిలో పడి వున్న వీరిని కుటుంబ సభ్యులు గుర్తించి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. సోమవారం ఆదెమ్మ మృతి చెందగా, మంగళవారం ఇరగమరెడ్డి మృతి చెందాడు. గంగాధరనెల్లూరు ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.