క్రైమ్/లీగల్

క్షుద్రపూజల అనుమానంతో మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, సెప్టెంబర్ 20: క్షుద్ర పూజలు చేస్తుందనే అనుమానంతో ఒక గిరిజన మహిళను ఆమె మరిదే దారుణంగా నరికిచంపాడు. ఈ ఘాతుకం తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం గుంజిగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడబాల సత్యవతి (40) అనే గిరిజన మహిళ క్షుద్రపూజలు చేస్తుందని అనుమానించి ఆమె మరిది చిన్నారావు ఆమెను అతి కిరాతకంగా కత్తితో నరికేశాడు. తల నుండి మొండెం వేరుపడి, సత్యవతి అక్కడికక్కడే మృతిచెందింది. సత్యవతి కుటుంబానికి, చిన్నారావు కుటుంబానికి గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం కూడా వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం 9గంటల సమయంలో చిన్నారావు తన వదిన సత్యవతిపై కత్తితో దాడిచేసి నరికి చంపాడు. నిందితుడు చిన్నారావు పరారీలో ఉన్నట్లు రంపచోడవరం ఎస్సై విజయబాబు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదుజేసి దర్యాప్తుచేస్తున్నట్టు చెప్పారు.

చిత్రం..సంఘటనా స్థలంలో సత్యవతి మృతదేహం