క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, సెప్టెంబర్ 21: ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు లారీ కింద పడి మృతి చెందాడు. మండలంలోని దాలింపేట గ్రామానికి చెందిన విత్తనాల సాహితీవిశాల్(6) కొండల అగ్రహారంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అయితే శుక్రవారం మోహరం సెలవు కావడంతో విశాల్ ఇంటి వద్దనే ఉండిపోయాడు. వినాయకుని నవరాత్రుల్లో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా అదే సమయంలో నర్సీపట్నం నుంచి మాకవరపాలెం వస్తున్న లారీ బాలుడుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విశాల్ లారీ చక్రంతో పాటు కొంత దూరం ఈడ్చుకుపోవడంతో కాళ్ళు, చేతులు పూర్తిగా శిధిలమయ్యాయి. తీవ్ర గాయాలపాలైన బాలుడిని వెంటనే 108లో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి విశాఖపట్నం తరలిస్తుండగా కశింకోట వద్దకు వెళ్ళే సరికి బాలుడు మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై విజయ్‌కుమార్ పరిశీలించి కేసు నమోదు చేసారు. బాలుడి మృతితో తల్లిదంఢ్రులు నాగరాజు, లక్ష్మితో పాటు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నవయస్సులోనే లారీ ప్రమాదంలో మృతువు తన కుమారుడిని అందరాని లోకాలకు తీసుపోయిందని తల్లిదంఢ్రులు భోరున విలపిస్తున్నారు.