క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, సెప్టెంబర్ 21: నిజామాబాద్ మండలం సారంగపూర్ సీడబ్ల్యుసీ గోడౌన్ల సమీపంలో ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రహీమ్‌ఖాన్(42) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బిలాల్‌నగర్‌కు చెందిన రహీమ్‌ఖాన్ తన సొంత ఆటోరిక్షాలో నిజామాబాద్‌కు వస్తుండగా, ఎదురుగా వస్తున్న ఓమిని వ్యాన్ బలంగా ఢీకొట్టింది. దీంతో రహీమ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఓమిని వ్యాన్‌లో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటనలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆరవ టౌన్ ఎస్‌ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించి, స్థానికులను ప్రమాద వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. రహీమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ తెలిపారు.