క్రైమ్/లీగల్
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 21 September 2018
సంతమాగులూరు, సెప్టెంబర్ 21: గొర్రెలకు మేత కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని కుందుర్రు గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో మోరబోయిన కోటేశ్వరావు(20) మృత్యువాతపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మోరబోయిన కోటేశ్వరరావు గొర్రెల మేత కోసం ఆయనదొడ్డిలోని చెట్టు విరుచుకు వచ్చేందుకు వెళ్లాడు. అదే దొడ్డిలో ఉన్న కందిపైరు నూర్చే యంత్రంపై విద్యుత్ సర్వీస్ వైరు పడింది. అయితే మేత విరుచుకునే పనిలో ఉన్న కోటేశ్వరరావు చెట్టు కొమ్మలు లాగేందుకు ప్రయత్నించి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, కోటేశ్వరరావు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.