క్రైమ్/లీగల్

లోయలో పడిన వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, సెప్టెంబర్ 22: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో శనివారం ఒక వాహనం లోయలో పడి మూడు జంటలు సహా మొత్తం 13 మంది మృతి చెందారు. కుడ్డు నుంచి టియుని రోడ్డు మీదుగా వెళ్తున్న ఈ వాహనం సనైల్ వద్ద బాగా లోతున్న లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. స్వారా నుంచి టియునికి వెళ్తున్న ఈ ట్రాక్స్ వాహనం లోయలో పడటం వల్ల అందులో ప్రయాణిస్తున్న మొత్తం 13 మంది మృతి చెందారని సిమ్లా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) ఒమాపతి జమ్‌వాల్ తెలిపారు. ఈ ప్రమాదంలో పది మంది సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురు రోహ్రు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని జమ్‌వాల్ వివరించారు. మృతుల్లో మూడు కుటుంబాలకు చెందిన వారే ఎనిమిది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి సజీవంగా ఉన్న ముగ్గురు క్షతగాత్రులను బయటకు తీసి, ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ముగ్గురూ చికిత్స పొందుతూ మృతి చెందారని జమ్‌వాల్ వివరించారు.