క్రైమ్/లీగల్
వినాయక నిమజ్జనంలో విషాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 24 September 2018
తిరుమలసాగర్, సెప్టెంబర్ 23: నల్లగొండ జిల్లా తిరుమలసాగర్ మండలంలోని బోయగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకొంది. వినాయక విగ్రహం మీద పడటంతో బులిగొర్ల రామకృష్ణ (8) దుర్మరణం చెందాడు. శోభాయాత్రలో 12 అడుగుల విగ్రహానికి చెట్టుకొమ్మ తగలడంతో విగ్రహం ట్రాక్టర్ మీద నుంచి కిందకు జారి బాలుడి మీద పడింది. దీంతో రామకృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు. బులిగొర్ల శ్రీనివాస్ భారతి దంపతుల ద్వితీయ కుమారుడైన రామకృష్ణ మృతితో తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. అనందోత్సాహాలతో సాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఆకస్మికంగా ప్రమాదం చోటు చేసుకుని బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.