క్రైమ్/లీగల్

ఈత కోసం వచ్చి... మృత్యు ఒడిలో మునిగి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, సెప్టెంబర్ 25: ఈత కోసం రాయలచెరువుకు వచ్చి నీటిలో మునిగి మృత్యు ఒడిలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రభావతి వివరాల మేరకు తిరుపతి దాసరిమఠానికి చెందిన మాధవ్ (14) స్నేహితులు ప్రకాష్, శివసాయి, కార్తీక్, ఫయాజ్, పవన్‌లతో కలసి రాయల్‌చెరువులో సరదాగా ఈత కొట్టడానికి వచ్చారు. ఈత కొడుతూ మాధవ్ నీటిలో మునిగిపోయాడు. తమ స్నేహితుడ్ని రక్షించాల్సిందిగా తోడు వచ్చిన వారు అరుస్తూ సమీపంలోని బోట్‌షికారు నిర్వాహకుల వద్దకు పరుగులు తీశారు. బోట్‌షికారు నిర్వాహకులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నీటిలో మునిగి మాధవ్‌ను వెలుపలికి తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మాధవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మాధవ్ కొన ఊపిరితో ఉండటంతో తల్లిదండ్రుల ద్వారా తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. రుయాసుపత్రిలో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి బుధవారం తదుపరి కార్యక్రమాలు నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందించనున్నట్లు ప్రభావతి తెలిపారు.