క్రైమ్/లీగల్

మామండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 25: కడప-రేణిగుంట జాతీయ రహదారిలో మండల పరిధిలోని మామండూరు వద్ద రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి చెందిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున రెండు గంటలకు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రేణిగుంట నుంచి సిమెంట్ బస్తాలతో కడప వైపు వెడుతున్న మినీ ఈచర్ లారీ, కడప నుంచి ఐరన్ ఓర్‌తో రేణిగుంట వైపు వస్తున్న తమిళనాడుకు వెడుతున్న లారీ మామండూరు వద్ద ఢీకొన్నాయి. ముందు వెడుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో మినీ ఈచర్ లారీ ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలు నడుపుతున్న డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ రహదారిలో దాదాపు రెండు గంటలసేపు రెండు వైపులా భారీ ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయింది. విషయం తెలుసుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్‌ల సహాయంతో రోడ్డుపైనున్న లారీలను పక్కకు తొలగించి లారీలోని మృతదేహాలను బయటకు తీశారు. సిమెంట్ లారీకి చెందిన డ్రైవర్ మహారాష్టక్రు చెందిన ధనరాజ్ (34), తమిళనాడు నుంచి వస్తున్న ఐరన్ ఓర్ లారీ డ్రైవర్ ప్రేమ్‌కుమార్ (28)గా గుర్తించామని, మృతదేహాలను శవపంచనామా నిమిత్తం రుయాకు తరలించినట్లు ఎస్‌ఐ ఇమ్రాన్ బాషా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.