క్రైమ్/లీగల్
ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ : ఒకని మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంబేపల్లె, సెప్టెంబర్ 26: మండల పరిధిలోని రౌతుకుంట-దినె్నమీదపల్లె గ్రామీణ రోడ్డు మార్గమధ్యలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీకొని లక్షుమయ్య(36) మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రౌతుకుంట గ్రామం బోయపల్లెకు చెందిన యాదగిరి లక్షుమయ్య, వెంకటేష్తో కలిసి ద్విచక్రవాహనంపై రౌతుకుంటకు వెళ్లి తిరిగి వస్తుండగా కుంటకింద క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో లక్షుమయ్య, వెంకటేష్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యచికిత్సల నిమిత్తం 108 వాహనం ద్వారా రాయచోటికి తరలించారు. ఇరువురి పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ లక్షుమయ్య మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. లక్షుమయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు కలరు. సంఘటన తెలిసిన వెంటనే ఎస్ఐ సయ్యద్ హషం సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద ఘటనపై విచారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.