క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి ఆర్టీసీ డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, సెప్టెంబరు 26: విద్యుదాఘాతానికి గురై ఓ ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన మంతెన గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని మంతెన గ్రామానికి చెందిన డీ ఏడుకొండలు (55) తన ఇంటి వద్ద బోరు బావి మోటర్ సరిగా పనిచేయటం లేదని దానిని పరిశీలించేందుకు చేతిపంపుని పట్టుకుని చూస్తుండగా వర్షం కురవటంతో విద్యుదాఘాతానికి గురైయ్యాడు. భార్య రక్షించేందుకు ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్‌షాక్‌కు గురై దూరంగా పడిపోయింది. చుట్టుపక్కల వారు రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే ఏడుకొండల మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.