క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మాహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, సెప్టెంబర్ 26: న్యాయస్థానం ఆదేశం మేరకు మొవ్వ తహశీల్దార్ రామానాయక్ సూచనల మేరకు స్థలం కొలుస్తున్న అధికారులను చూసి ఆందోళన చెందిన వివాహిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మొవ్వ మండలం నిడుమోలులో చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్‌ఐ దుర్గా మహేశ్వరరావు సమాచారం మేరకు నిడుమోలు గ్రామానికి చెందిన కందుకూరి చిన్నికృష్ణ, రమాదేవి గృహాలకు పక్కనే ఉన్న డొక్కు లక్ష్మీ కుమారికి సరిహద్దు తగాదాలు ఉన్నాయి. వాద ప్రతివాదులు న్యాయ థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆదేశం మేరకు కోర్టు అమీనా, వీఆర్‌ఓ కట్టా శ్యామసుందర్, సర్వేయర్ శ్రీనివాసరావు స్థలం కొలతలు ప్రారంభించారు. దీంతో తన స్థలం పోతుందన్న ఆందోళనతో రమాదేవి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని అత్యవసర వైద్య చికిత్స కోసం మచిలీపట్నం వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, చల్లపల్లి సీఐ బి జనార్ధనరావు హుటాహుటిన సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మచిలీపట్నంలో చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.