క్రైమ్/లీగల్

ట్రాక్టరు బోల్తా: డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మార్చి 1: మండలంలోని రొయ్యూరు ఉచిత ఇసుక క్వారీలో గురువారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ జొన్నలగడ్డ రాజశేఖర్(23) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కంచికచర్ల మండలం జమ్మవరం గ్రామానికి చెందిన రాజశేఖర్ యనమలకుదురులో కనగాల రామలింగేశ్వరరావు వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఇసుక కోసం ట్రాక్టర్ వేసుకొచ్చాడు. కూపన్ తీసుకుని క్వారీలోకి వెళుతుండగా ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ట్రాక్టర్ అతి వేగంగా నడపటంతో అదుపుతప్పి బోల్తా కొట్టినట్టు స్థానికులు చెపుతున్నారు. దాంతో ట్రక్కు ఒకచోట, కొంత దూరంలో ఇంజన్ పడిపోయాయి. తీవ్ర గాయాలకు గురైన కొన ఊపిరితో ఉన్న రాజశేఖర్‌ని ఇసుక ట్రాక్టర్‌పై రొయ్యూరులో స్థానిక వైద్యుని వద్దకు తీసుకువచ్చారు. చికిత్స అందేలోపు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రసాద్, ఏఏస్‌ఐ నాంచారయ్య, విఆర్‌ఓ రామ్‌కుమార్ ఘటనా స్థలానికి వచ్చారు. రాజశేఖర్ మృతిపై వివరాలు సేకరించారు. ట్రాక్టర్ యజమాని రామలింగేశ్వరరావు నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.