క్రైమ్/లీగల్

భార్యను చంపి భర్త పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మార్చి 1: కుటుంబ తగాదాలు, మద్యం మత్తులో తలపై దిండు మోపి భార్యను భర్త చంపిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పాలేరు ప్రాంతానికి చెందిన భూక్య సందీప్, సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామానికి చెందిన రాణీ(26)కి ఏడేళ్ల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పూజిత (6)యశ్వంత్ (4) సంతానం ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి వనస్థలిపురం సాహేబ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. కుటంబ పోషణకు సందీప్ ఆటో నడుపుతుండగా, ఇళ్లల్లో రాణి(26) పనిచేస్తోంది. కొంతకాలం వీరి సంసారం ప్రశాంతంగా సాగింది. తర్వాత సందీప్ మద్యానికి అలవాటు పడి నిత్యం భార్యతో గొడవపెట్టుకునేవాడు. బుధవారం రాత్రి పీకలదాక మద్యం సేవించిన సందీప్‌తో రాణి గొడవ పడింది. ఇరువురి మధ్య జరిగిన గొడవలో రాణి తలపై దిండు పెట్టిగట్టిగా నొక్కడంతో చనిపోయింది. భార్య చనిపోయినట్లు తెలుసుకున్న భర్త సందీప్.. తన కొడుకుని తీసుకొని పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.