క్రైమ్/లీగల్

కరెంట్‌షాక్‌తో ఛత్తీస్‌ఘడ్ యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, అక్టోబర్ 15: బతుకుదెరువుకోసం వచ్చిన ఓ యువకుడు కరెంట్‌షాక్ గురై మృతిచెందిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సునీల్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన కురున్(22) గత ఆర్నేళ్లుగా మదనపల్లె ప్రాంతంలోని బోరుబండి కార్మికుడుగా పనిచేస్తున్నాడు. సోమవారం బోరుబండికి మరమ్మతులు పనులు చేస్తుండగా కురున్‌కు కరెంట్‌షాక్ కొట్టి కిందకు పడిపోయాడు. కోమాలోవున్న కురున్(22)ను హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని ఛత్తీస్‌ఘడ్‌కు తరలించే యత్నంలో తాలూకాపోలీసులు గుట్టురట్టు చేయడంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.