క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన హౌసింగ్ ఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 15: ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు కోసం రూ.7 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం హౌసింగ్ ఏఈ రంగస్వామిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన లబ్దిదారుడు రాజశేఖర్ 2006లో మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం ఏఈని సంప్రదించగా ఆయన రూ. 10వేలు లంచం అడిగాడు. ఏడు వేలు ఇచ్చేలా ఒప్పంద చేసుకున్న రాజశేఖర్ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువచ్చాడు. వారి సూచన మేరకు సోమవారం వర్క్‌ఇన్‌స్పెక్టర్ సుబ్బలక్ష్మికి రాజశేఖర్ డబ్బు అందజేశాడు. ఆమె ఏఈ రంగస్వామికి ఇస్తుండగా ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఏసీబీ డిఎస్పీ జయరామరాజు తెలిపారు.