క్రైమ్/లీగల్

రెండు కార్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, మార్చి 2: ఇక్కడి రెల్లి కాలనీలో పెళ్లికుమార్తె ఇంటి వద్ద వివాహ విందు కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన గొడల్లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీనిపై కోపోద్రిక్తులైన బాధితులు, బాధితుల తరపుబంధువులు విజయవాడ నుండి ఇక్కడకు విందుకు వచ్చి ఆర్టీసి బస్టాండ్‌లో ఉంచిన పెళ్లికుమారుని కార్లను దహనం చేసిన సంఘటనలో ఇరువర్గాలకు చెందిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు స్థానిక ఎస్‌ఐ పి. సింహాచలం చెలిపారు. ఈ నేరానికి సంబంధించిన వివరాలిలావున్నాయి. కృష్ణాజిల్లా గుణదల మండలం అరుణనగర్‌కు చెందిన పెళ్లి కుమారుడు జలియాల సాయి పెళ్లి బృందంతో తమ బంధువులను వెంటబెట్టుకుని నక్కపల్లికి బుదవారం వచ్చారు. అదేరోజు పెళ్లి కుమార్తె మొల్లేటి అప్పారావు కుమార్తె లక్ష్మి ఇంటివద్ద వివాహ భోజన కార్యక్రమం జరిగింది. విజయవాడకు చెందిన పెళ్లికుమారునికి సంబంధించిన ఆరుగురు యువకులు భోజనాలు వడ్డించే దగ్గర పెళ్లికుమారునితో గొడవపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో పెళ్లి కుమారుని తరపు వర్గానికి చెందిన మట్టా విజయ్‌కుమార్ (25), దళారి సత్యసాయి శ్రీకర్ (18), సింగంపల్లి నూకేష్ (23), రంజిత్ (19), గోకవరపు ప్రవీణ్ (18), నాగవెంకట శివలు ఏకమై పెళ్లి కుమార్తె తరపున ఎం. నాగేశ్వరరావు, బంగారు అప్పలరాజులన తీవ్రంగా కొట్టి గాయపరిచారు. దీంతో ఆగ్రహాం చెందిన పెళ్లికుమార్తె సమీప బంధువులు నక్కపల్లి రెల్లికాలనీకి చెందిన కశింకోట దుర్గారావు(19), కోన సతీష్ (19) నక్కపల్లి బస్టాండ్ వద్ద పార్కింగ్ చేసిన రెండు ఇన్నోవా కార్లను అర్ధరాత్రి సమయంలో కిరోసిన్ పోసి తగులబెట్టారు. ఈ సంఘటనలో రెండు కార్లు పూర్తిగా కాలి దహనమయ్యాయి. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదు మేరకు పెళ్లికుమారుడు వర్గంలోని ఆరుగురిపైనా, పెళ్లికుమార్తె వర్గంలోని ఇద్దరిపైనా కేసునమోదు చేసి అరెస్టుచేసినట్లు స్థానిక ఎస్‌ఐ పి. సింహాచలం తెలిపారు.