క్రైమ్/లీగల్

అదనపు కట్నం వేధింపుల కేసులో భర్త అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, నవంబర్ 12: అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేయడంతోపాటు వేధింపులు కారణంగా కోట్ల లక్ష్మి పురుగుల మందు సేవించి ఇటీవల మృతి చెందింది. మృతురాలి వేధింపులకు ప్రధాన కారకుడైన భర్త కోట్ల సంతోష్‌ను సోమవారం బొబ్బిలి ఏస్పీ గౌతమిశాలి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లోగిశ గ్రామానికి చెందిన కోట్ల సంతోష్‌కు అదే గ్రామానికి చెందిన లక్ష్మితో ఈ ఏడాది సెప్టెంబర్ 8న వివాహం జరిగింది. వివాహ సందర్భంగా సంతోష్‌కు లక్ష్మి తండ్రి సూర్యప్రకాశరావు మూడున్నర లక్షలు కట్నంతోపాటు ఎకరా పొలాన్ని కట్నకానుకలు కింద ఇవ్వడం జరిగింది. మృతిరాలికి ఇచ్చిన భూమిని తమపేరున రిజిష్ట్రేషన్ చేయాలని సంతోష్‌తో పాటు అతని తల్లిదండ్రులు, ఆడపడుచులు లక్ష్మిని వేధించేవారు. ఈ నేపధ్యంలో నాలుగురోజులు కిందట వేధింపులు తాళలేక పురుగుల మందు సేవించి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించి భర్త సంతోష్‌ను పరిగిణించి అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.