క్రైమ్/లీగల్

రైలు ప్రమాదంలో బధిర విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, నవంబర్ 13: రైలు ఢీకొట్టిన ప్రమాదంలో స్థానిక భవిత కేంద్రానికి చెందిన బదిర విద్యార్థి మృతిచెందాడు. మంగళవారం స్థానికులు అందించిన వివరాల ప్రకారం భవిత కేంద్రానికి చెందిన బదిర విద్యార్థి బీలసాయి(14) రైలు ఢీకొని మృతిచెందాడు. మృతుడు సాయి పూతికపేట గ్రామానికి చెందినవాడు. పుట్టకతోనే మూగ,చెవిటి కావడంతో స్థానిక భవిత కేంద్రంలో శిక్షణ కోసం తల్లిదండ్రులు చేర్పించారు. మృతుడు జిల్లా కేంద్రంలో దివ్యాంగుల క్రీడాపోటీలకు తోటి విద్యార్థులతో వెళ్ళాడు. మరో విద్యార్థి శంకరరావుతో కలసి ఐ ఇ ఆర్‌టి బుచ్చిరాజు తీసుకువెళ్ళారు. క్రీడలు ముగిసిన వెంటనే ఐ ఇ ఆర్‌టి బుచ్చిరాజు ఇద్దరు విద్యార్థులను నెల్లిమర్ల తీసుకువచ్చి మీమీ స్వగ్రామాలకు ఆటోల్లో వెళ్ళిపోమని చెప్పారు. అయితే నెల్లిమర్ల పాతరైల్వేగేటు వద్ద పట్టాలు దాటుతుండగా బీలసాయిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.