క్రైమ్/లీగల్

లారీ ఢీ కొని ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం(రూరల్), నవంబర్ 13: మండలంలోని లొద్దపుట్టి సమీపంలో జాతీయరహదారిపై లారీ ఢీ కొని ఒకరు మృతి చెందగా, మరొకరు పరిస్థితి విషమంగా ఉందని కవిటి మండలం కమలాయిపుట్టుగ గ్రామానికి ఎస్.మోహనరావు (71), ఎస్.జోగమ్మ ఇద్దరు ఇచ్ఛాపురం బ్యాంకు పనులు నిమిత్తం వచ్చి, తిరిగి వెళ్తుండగా మలుపు వద్ద లారీ ఢీ కొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వైద్యసేవలు అందించగా, మోహనరావు మృతి చెందాడు. జోగమ్మను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించి, వైద్యసేవలు అందిస్తున్నారు. మృతుడుకు ఇద్దరు కుమారులు,ముగ్గురు కుమార్తెలున్నారు. ఈ సంఘటనపై రూరల్ ఎస్ ఐ కోటేశ్వరరావు కేసును నమోదు చేసారు.

ద్విచక్రవాహనాలు ఢీ, నలుగురుకు గాయాలు
కవిటి, నవంబర్ 13: మండలంలోని శిలగాం, పూడివీధి వద్ద గల రహదారిపై ద్విచక్రవాహనాలపై ఎదురెదురుగా వెళ్తున్న ఢీ కొన్న సంఘటనలో నలుగురుకు గాయాలయ్యాయి. కవిటి పోలీసుల వివరాలు ప్రకారం డి.గొనగపుట్టుగ గ్రామానికి చెందిన ఎర్రయ్య, బి.కామయ్యలు ద్విచక్రవాహనంపై వస్తుండగా వారికి ఎదురుగా సహాలాలపుట్టుగ గ్రామానికి చెందిన భగవాన్, జయదేవ్‌లు వెళ్తున్న వాహనం ఎదురెదురుగా ఢీ కొనడంతో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారందరిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఎర్రయ్య ఫిర్యాదు మేరకు ఎస్ ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.