క్రైమ్/లీగల్

కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యాడు. అతి వేగంతో దూసుకు వచ్చిన సీబీజడ్ బైక్ జహానుమాలోని బాయిస్ టౌన్ హైస్కూల్ వెనుకభాగంలోని ముల మలుపులో ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. మంగళవారం తెల్లావారుఝామున రెండున్నర గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న 23 ఏళ్ల వాసీమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఫలక్‌నుమాలోని జహానుమ రోడ్డుపై గుంటలు ఉండటంతో పాటు వీధిలైట్లు లేకపోవడంతో చిమ్మ చీకటి కమ్ముకుంది. దీంతో వేగంగా బైక్‌పై వచ్చిన యువకుడు మూల మలుపు ఉన్న విషయాన్ని గమనించలేకపోయాడు. అదే వేగంతో వెళ్లి స్తంభాన్ని ఢీ కొట్టాడు. దీంతో యువకుడు తలకు తీవ్ర గాయాలు తగిలాయి. ఇది గమనించిన స్థానికులు చికిత్స కోసం గాయాల పాలైన వాసీమ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఫలక్‌నుమా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వాసీమ్ పరిస్థితి విషమంగా ఉందిని ఫలక్‌నుమా పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.