క్రైమ్/లీగల్

తిమ్మాపురంలో విషాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంబదూరు, నవంబర్ 14 : మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఇంటి దూలం విరిగి పైకప్పు కూలడంతో వడ్డే సుబ్బరాయుని తిమ్మక్క (30), కుమారుడు రవి (11), కూతురు మహలక్ష్మి (9) మృతిచెందారు. సుబ్బరాయుడు మాత్రం ఇంటి మూలన కూర్చొని టీవీ చూస్తుండడంతో తల, భుజాలకు బలమైన గాయాలయ్యాయి. మూడు నెలల క్రితం సుబ్బరాయుడు ఇంట్లోకి కాకి దూరడంతో బాడుగ ఇంట్లో కాపురం ఉంటున్నాడు. మంగళవారానికి మూడు నెలలు పూర్తయి బుధవారం తన సొంతిట్లో పాలు పొంగించుకోవాలని సిద్ధమవుతున్న తరుణంలో ఇంటి పైకప్పు కూలి మృత్యువు కబలించడంతో బంధువులను విషాదఛాయల్లో ముంచెత్తింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా జడ్పీటీసీ రామ్మోహన్‌చౌదరి మృతుని బుధవారం బంధువులను కలుసుకుని 10 వేల ఆర్థిక సాయం అందించారు. అలాగే తహశీల్దార్ మసూద్‌వలి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతురాయచౌదరి, వైకాపా కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషశ్రీ మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాతం తెలిపారు.