క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 15: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాజులరామారం, రోడామేస్ర్తి నగర్‌లో నివాసముండే ఇమ్రాన్ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తాడు. ఇతనికి అంబేద్కర్ నగర్‌కు చెందిన మహ్మద్ మాజిద్ కుమార్తె అమ్రీన్ బేగం(19)తో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. గురువారం అమ్రీన్ బేగం ఇంట్లో అనుమానాస్పదంగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. స్థానికులు గమనించే సరికి మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. అమ్రీన్ బేగంను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.