క్రైమ్/లీగల్

తనిఖీల్లో రూ. 5లక్షల నగదు పట్టివేత: సీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, నవంబర్ 17: కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా శనివారం నిర్వహించిన వివిధ రకాల తనిఖీల్లో రూ. 5లక్షల నగదు పట్టుబడి నట్లు నగర పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని టూ టౌన్ పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 5లక్షల నగదును తరలిస్తుండగా సీఐ చల్ల దేవారెడ్డి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇదే విధంగా కరీంనగర్ నియోజక వర్గంలో 2కేసుల్లో 13మంది బైండోవర్ చేసి, ఒక వ్యక్తి నుంచి 1320విలువచేసే 2.5లీటర్ల మద్యం పట్టుబడిందని తెలిపారు. చొప్పదండి నియోజక వర్గంలోని 3కేసుల్లో 12మందిని, మానకొండూర్ నియోజకవర్గంలో 3కేసుల్లో 17మంది, హుజురాబాద్ నియోజక వర్గంలో ఒక్క కేసులో ఒక్కరిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. సైదాపూర్ మండలం గొడిశాల గ్రామంలో ఎన్నికలు, ఓటు హక్కు వినియోగంపై పోలీస్ కళా బృందం ద్వారా ప్రదర్శన నిర్వహించారు.