క్రైమ్/లీగల్

కొత్తపల్లిలో దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోకవరం, నవంబర్ 19: అత్తను అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపిన సంఘటన సోమవారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో తీవ్ర కలకలాన్ని రేకెత్తించింది. ఆ గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బొరి చంటమ్మ (65)ను ఆమె అల్లుడు ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన జాజిమొగ్గల దుర్గాప్రసాద్ కత్తితో కొత్తపల్లి గ్రామం చాకలిపేటలో విచక్షణా రహితంగా నరికి హతమార్చాడు. కొత్తపల్లి గ్రామానికి చెందిన బొరి దుర్గ (దివ్యాంగురాలు)కు ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన జాజిమొగ్గల దుర్గాప్రసాద్‌తో 3 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి సంవత్సరం వయస్సున్న బాబు ఉన్నాడు. దుర్గాప్రసాద్, దుర్గల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. భర్త పెట్టే చిత్రహింసలు భరించలేని దుర్గ ఇటీవల పుట్టింటికి వచ్చేసింది. అప్పట్నుంచీ దుర్గ సామర్లకోటలోని వెలుగు కార్యాలయంలో ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా..సోమవారం ధర్మవరం నుంచి దుర్గాప్రసాద్ కొత్తపల్లి వచ్చి తన భార్య దుర్గ కోసం ఆరా తీసి అనంతరం అత్త చంటమ్మతో ఘర్షణకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏర్పడ్డ ఘర్షణ శృతిమించి దుర్గాప్రసాద్ అత్త చంటమ్మను కత్తితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న కోరుకొండ సీఐ రవికుమార్, గోకవరం ఎస్సై జి ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు దుర్గాప్రసాద్‌ను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం శవ పంచానమా నిర్వహించి చంటమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన తల్లి హత్య వార్త తెలుసుకున్న దుర్గ సామర్లకోట నుంచి కొత్తపల్లికి వచ్చింది. అత్తతో ఘర్షణ పడుతున్న సమయంలో దుర్గ కూడా ఉంటే ఆమెను కూడా హత్య చేసి ఉండేవాడని కొత్తపల్లి గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.