క్రైమ్/లీగల్

ఆలయ అర్చకుడు మృతికి సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, నవంబర్ 19: క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు కోట నాగ వెంకట వరప్రసాద్ (నాగబాబు) మృతికి పలువురు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కార్తీక సోమవారం ఉదయం ఆలయంలో పూజలు నిర్వహిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన నాగబాబును ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు ప్రకటించారు. చాలకాలంగా ఆలయంలో అర్చకులుగా నాగబాబు అందరికీ సుపరిచితులు కావడంతో ఆయన మృతి పట్ల భక్తులు విచారం వ్యక్తం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు యడ్ల శివాజీ, ధర్మకర్తలు అడ్డాల ప్రసాద్, నాళం బాబి, కలిదిండి సత్యనారాయణరాజు, కోరుకొండ సుబ్బారావు, తిమిరి వెంకటేశ్వర్లు వడూరి రాజమణి, రెడ్డి చిన్ని, ఆలయం ప్రధాన అర్చకులు మల్లికార్జునరావు, సూపరింటెండెంట్ నరసింహస్వామి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కర్నేన రోజారమణి, జివి, బిరుదుకో శేఖర్, చినమిల్లి గణపతిరావు తదితరులు సంతాపం తెలిపారు