క్రైమ్/లీగల్

మహిళ అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, నవంబర్ 20: ప్రభుత్వ ఆసుపత్రి మరుగుదొడ్డిలో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మరుగుదొడ్డి కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యాడికి మండలం చింతరాయపల్లెకు చెందిన మెహరూన్‌బీ(50) చికిత్స కోసం ఈనెల 6వ తేదీ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని మరుగుదొడ్డి కిటికీకి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది ఇది గమనించి పోలీసులకు సమాచారం. అందించారు. కాగా మెహరూన్‌బీ ఆత్మహత్య చేసుకున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఆసుపత్రిలోని ఒక మరుగుదొడ్డి కిటికీ చువ్వలకు చీర కట్టి పక్కనే ఉన్న మరో మరుగుదొడ్డిలో ఆ చీరను మెడకు బిగించుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఓ పక్క మెహరూన్‌బీ ఆరోగ్యం సరిగా లేదని కూతురు రజియా చెబుతోంది.
మరోవైపు ఆమె ఆత్మహత్య చేసుకున్న తీరు సందేహాలకు తావిస్తోంది. ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చి తల్లిని చూసుకుని వెళ్లేదానినని కూతురు రజియా తెలిపింది. సోమవారం రాలేకపోవడంతో తనను చూసుకునే వారు ఎవరూ లేరని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఆమె పేర్కొంది. తాడిపత్రి పట్టణ ఎస్సై రాఘవరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి మరుగుదొడ్డిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళ