క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.కోడూరు, నవంబర్ 29 : మండల పరిధిలోని పోరుమామిళ్ల-బద్వేల్ ప్రధాన రహదారిలో ఖాతానగరం సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకెళ్లగా ఏపి09 డిసీ 8028 నంబరుగల టాటా ఇండికా కారు పోరుమామిల్లనుండి బద్వేల్‌కు వెళ్తుండగా ఖాతానగరం సమీపాన రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న దాసరి సుబ్బయ్య(42), సుభాష్ (10), శ్రీరామ నాగరాజు (29), జగన్నాథం సుబ్బయ్యలను కారు ఢీకొంది. ఈ సంఘటనలో దాసరి సుబ్బయ్య సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు అవడంతో క్షతగ్రాతులను పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించినట్లు బి.కోడూరు ఎస్‌ఐ ఘన మద్దిలేటి తెలిపారు. మృతి చెందిన వ్యక్తి, క్షతగాత్రుడు బి.కోడూరు గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.