క్రైమ్/లీగల్

ఆటోను ఢీకొన్న ట్రాలీ: ఇద్దరు మృతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్నూర్, నవంబర్ 29: మండలంలోని పెద్ద ఎక్లార గేటు సమీపంలో ఎస్‌ఎన్‌ఎ రహదారిపై, గురువారం నాడు ఆటోను బులేరో ట్రాలీ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురికి గాయాలైయ్యాయి. మద్నూర్ ఎస్‌ఐ సాజిద్ తెలిపిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. జుక్కల్ మండలం నాగల్ గావ్ గ్రామంలో జరిగిన శుభ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఆటోలో బిచ్కుందకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బులేరో ట్రాలీ వాహనం ఢీకొనడంతో, ఆటోలో ప్రయాణిస్తున్న బిచ్కుంద మండలానికి చెందిన భారతి (50) మృతి చెందారు, అలాగే బిచ్కుంద నుంచి మహారాష్టక్రు వెళ్తున్న మరో ఆటో ఢీకొన్న రెండు వాహనాలకు వేగంగా ఢీకొట్టడంతో, మహారాష్టల్రోని దెగ్లూర్ తాలుకాలోని భక్తాపూర్ గ్రామానికి చెందిన గణపతి (50) మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. సంఘటన జరిగిన స్థలం బిచ్కుంద మండల కేంద్రానికి దగ్గరగా ఉండటంతో, క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు ఇరు వర్గాల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాజిద్ తెలిపారు.